హైదరాబాద్, వెలుగు: ఆసియా బీచ్ వాలీబాల్ చాంపియన్షిప్లో పాల్గొనే ఇండియా జట్టుకు హైదరాబాద్కు చెందిన ఎం. కృష్ణంరాజు, టి. నరేశ్ ఎంపికయ్యారు. ఈ నెల 23 నుంచి చైనా ఫుజియన్లోని పింగ్టన్లో ఈ టోర్నీ జరగనుంది. ఇండియా తరఫున రాజు, నరేవ్ బరిలోకి దిగనున్నారు.
గతంలో నేషనల్ చాంపియన్స్ నిలిచిన ఈ ఇద్దరూ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ (జీఎస్టీ, హైదరాబాద్)లో ఇన్స్పెక్టర్లుగా పని చేస్తున్నారు. ఓ వైపు జాబ్ చేస్తూనే, వాలీబాల్ కెరీర్నూ కొనసాగిస్తున్నారు. ఆసియా టోర్నీ కోసం ప్రస్తుతం వైజాగ్లోని ఆర్కే బీచ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ టోర్నీలో మెడల్ సాధిస్తామని నమ్మకంగా ఉన్నారు.