ఎవరినీ వదలట్లా..: పాక్ పేసర్లను ఉతికారేస్తున్న భారత ఓపెనర్లు

ఎవరినీ వదలట్లా..: పాక్ పేసర్లను ఉతికారేస్తున్న భారత ఓపెనర్లు

కీలక మ్యాచ్‌లో భారత ఓపెనర్లు చెలరేగి ఆడుతున్నారు. పేసర్లే తమ బలం అని గొప్పగా చెప్పుకొనే.. పాకిస్తాన్ బౌలర్లను దంచి కొడుతున్నారు. ముఖ్యంగా షాహీన్ ఆఫ్రిది, నసీం షా, హారిస్ రౌఫ్ త్రయాన్ని టార్గెట్ చేసి మరీ కొడుతున్నారు. 

సూపర్- 4 స్టేజిలో పాకిస్తాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో శుభ్‌మ‌న్ గిల్(55), రోహిత్ శ‌ర్మ‌(53) జోడి ఎడా పెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. గిల్ 37 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ మార్క్ చేరుకోగా.. హిట్ మ్యాన్ 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి ధాటికి భారత జట్టు.. 15 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 115 పరుగులు చేసింది.

ALSOREAD:ఇండియా- పాక్ మ్యాచ్.. భారత్‌కు జై కొట్టిన ఆఫ్ఘన్ బ్యూటీ