ఇండియా- పాక్ మ్యాచ్.. భారత్‌కు జై కొట్టిన ఆఫ్ఘన్ బ్యూటీ

ఇండియా- పాక్ మ్యాచ్.. భారత్‌కు జై కొట్టిన ఆఫ్ఘన్ బ్యూటీ

ఆసియా కప్‌ -2023లో భాగంగా సూపర్‌-4 దశలో భారత్‌ - పాకిస్తాన్‌ జట్లు అమీతుమీ తేల్చుకుంటున్న విషయం తెలిసిందే. టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకోగా.. భారత ఓపెనర్లు ధనాధన్ బ్యాటింగ్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోవటంతో స్కోర్ బోర్డు కాస్త మందగించింది.

షాదాబ్ ఖాన్ బౌలింగ్ లో రోహిత్ శ‌ర్మ‌(56 : 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఔటవ్వగా.. త‌ర్వాతి ఓవ‌ర్లోనే శుభ్‌మ‌న్ గిల్(58 : 52 బంతుల్లో 10 ఫోర్లు) వెనుదిరిగాడు. షాహీన్ ఆఫ్రీదీ ఓవ‌ర్లో అఘా స‌ల్మాన్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. అనంతరం విరాట్ కోహ్లీ(8), కేఎల్ రాహుల్(17) జోడి నిలకడగా ఆడుతుండగా.. వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. వర్షం అంతరాయం కలిగించేసరికి భార‌త్ స్కోర్.. 24.1 ఓవర్లలో 147/2.

ALSOREAD:షాహీన్ ఆఫ్రిదినా..! తొక్కా..: రోహిత్‌ శర్మ ఖాతాలో అరుదైన రికార్డు

భారత్‌కు జై కొట్టిన ఆఫ్ఘన్ బ్యూటీ

ఇదిలావుంటే ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ గర్ల్ వాజ్మా అయూబీ భారత్‌కు జై కొట్టింది. హై-ఆక్టేన్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. "నా సెకండ్ హోమ్ టీమ్‌కు శుభాకాంక్షలు.. " అని ట్విట్టర్ లో రాసుకొచ్చింది. ఈ అమ్మడకి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో ఆఫ్ఘనిస్తాన్ ఆడే పలు మ్యాచ్‌లకు అయూబీ హాజరైంది. ఈ అమ్మడు చేసిన ట్వీట్.. పాకిస్తాన్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.