హైదరాబాద్, వెలుగు: అలానా గ్రూప్ జహీరాబాద్ రూ.200 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో పెడ్ఫుడ్ ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. ఇది కొన్ని వారాల్లో పనిచేయడం మొదలుపెడుతుందని కంపెనీ ప్రకటించింది. ఇది ఆసియాలోనే అతిపెద్ద పెట్ఫుడ్ ఫ్యాక్టరీ అవుతుందని తెలిపింది. "బౌలర్స్" బ్రాండ్ పేరుతో ఇక్కడ ప్రొటీన్ -రిచ్ డ్రైడ్ డాగ్ ఫుడ్ ప్రీమియం ప్రొడక్టులను తయారు చేస్తారు.
తాము డీహైడ్రేటెడ్ చ్యూస్, నేచురల్ బోన్ ప్రొడక్ట్స్, మీట్ జెర్కీ వంటి ప్రొడక్టులు తయారు చేస్తామని అల్లానా పెట్ ఫుడ్ సొల్యూషన్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తుల కోసం పెరుగుతున్న డిమాండ్ను తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన వివరించారు.