జహీరాబాద్​లో అలానా పెట్​ ఫుడ్ ​ఫ్యాక్టరీ ఆసియాలోనే అతిపెద్దది

జహీరాబాద్​లో అలానా పెట్​ ఫుడ్ ​ఫ్యాక్టరీ ఆసియాలోనే అతిపెద్దది

హైదరాబాద్​, వెలుగు: అలానా గ్రూప్ ​జహీరాబాద్​ రూ.200 కోట్ల ఇన్వెస్ట్​మెంట్​తో పెడ్​ఫుడ్​ ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. ఇది కొన్ని వారాల్లో పనిచేయడం మొదలుపెడుతుందని కంపెనీ ప్రకటించింది. ఇది ఆసియాలోనే అతిపెద్ద పెట్​ఫుడ్​ ఫ్యాక్టరీ అవుతుందని తెలిపింది. "బౌలర్స్"  బ్రాండ్​ పేరుతో ఇక్కడ ప్రొటీన్ -రిచ్ డ్రైడ్ డాగ్ ఫుడ్ ప్రీమియం ప్రొడక్టులను తయారు చేస్తారు.

తాము డీహైడ్రేటెడ్ చ్యూస్, నేచురల్ బోన్ ప్రొడక్ట్స్, మీట్ జెర్కీ వంటి ప్రొడక్టులు తయారు చేస్తామని అల్లానా పెట్ ఫుడ్ సొల్యూషన్స్ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఒకరు చెప్పారు.  భారత్​తోపాటు ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తుల కోసం పెరుగుతున్న డిమాండ్‌‌ను తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన వివరించారు.