
హాంగ్జౌ (చైనా): ఆసియా స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ చాంపియన్షిప్లో ఇండియా స్టార్స్ దీపిక పల్లికల్, హర్దీప్పాల్ సింగ్ సంధు గోల్డ్ మెడల్ సాధించారు. అనాహత్, అభయ్ సింగ్ బ్రాంజ్ నెగ్గారు. శుక్రవారం జరిగిన ఫైనల్లో దీపిక–హర్దీప్ 11–10, 11–8తో ఇవాన్–రాచెల్ (మలేసియా)పై గెలిచారు. ఇవాన్–రాచెల్తో జరిగిన సెమీస్లో ఓడిన అనాహత్–అభయ్ బ్రాంజ్తో సరిపెట్టారు.