టెన్త్ స్టూడెంట్ ని రేప్ చేసి చెట్టుకు ఉరి

టెన్త్ స్టూడెంట్ ని రేప్ చేసి చెట్టుకు ఉరి

అస్సాం:  చదువుకునే వయసులో విద్యార్థులు మృగాల్లా తయారవుతున్నారని తెలిపే దారుణ సంఘటన అస్సాంలో జరిగింది. ఓ వైపు రేప్ చేసిన వారికి ఉరి శిక్షలు పడుతున్నప్పటికీ మార్పు రావడంలేదు. పార్టీ పేరుతో తోటి విద్యార్థినిని ఏడుగురు టెన్త్ స్టూడెంట్స్ రేప్ చేసి చంపేశారు.

బిశ్వ‌నాథ్ జిల్లాలోని చ‌క్లా గ్రామంలో ఈ ఘాతుకం జ‌రిగింది.  ఘోపూర్ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. హెచ్ఎస్ఎల్‌సీ ప‌రీక్ష‌లు రాస్తున్న విద్యార్థుల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు ఓ సీనియ‌ర్ పోలీసు అధికారి చెప్పారు.  ప‌రీక్ష‌లు పూర్తి అయిన క్రమంలో.. ఇంట్లో పార్టీ చేసుకుందాం రావాలంటూ ఆ బాలిక‌ను ఆహ్వానించి.. ఆ త‌ర్వాత అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

శుక్ర‌వారం రాత్రి రేప్ చేసిన ఆ మానవ మృగాలు.. ఎక్కడ ఆ బాలిక ఈ విషయాన్ని బయటికి చెబుతుందోనని భయంతో చంపేశారు. ఇంటికి స‌మీపంలో ఉన్న ఓ చెట్టుకు ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు.  ఆదివారం బాలిక శ‌వం దొరికింది. గ్రామస్థుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తమదైన స్టైల్లో స్టూడెంట్స్ ని విచారించగా నేరాన్ని ఒప్పకున్నారు. వీరిపై కేసే నమోదు చేసిన పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.