వాళ్లు మనుషులేనా:ట్యూషన్ నుంచి వస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి..కిరాతకంగా..

వాళ్లు మనుషులేనా:ట్యూషన్ నుంచి వస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి..కిరాతకంగా..

మొన్నకోల్కతాలో..నిన్నముంబైలో..ఇవి కేవలం వెలుగులోకి వచ్చిన ఘటనలు మాత్రమే..వెలుగుచూడని సంఘటనలు ఇంకెన్నో..ముక్కుపచ్చలారని చిన్నారుల నుంచి పండు ముసలి వరకు ఆడదైతే చాలు.. అన్న చందంగా అఘాయిత్యాలు..రోజుకో దారుణం..అత్యంత పాశవికంగా..ఒళ్లు గగుర్పొడిచే తీరు..ఏమిటీ దారుణాలు.. ఎందుకీ వికృత చేష్టలు.. ఇదీ.. దేశవ్యాప్తంగా జరుగుతున్న మహిళలపై అత్యాచారాలు, హత్యలపై నిత్యం చూస్తూ.. వింటూ.. విసిగి వేసారిపోతున్న ప్రజల స్పందన.. కోల్ కతా.. ముంబై.. ఢిల్లీ ఘటనలు మరువకముందే మరో దారుణం.. అసోంలోని నాగాం జిల్లాలో ... వివరాల్లోకి వెళితే.. 

ALSO READ | మహిళలపై దాడులు ఆపేందుకు కఠిన చట్టాలు చేయండి... ప్రధాని మోదీకి సీఎం మమత లేఖ

ముక్కుపచ్చలారని బాలిక..చదువుకునేందుకు వెళ్లి ట్యూషన్ అయిపోయాక ఇంటికి వస్తున్న సమయంలో మాటు వేసి ముగ్గురు మానవ కృరమృగాలు అత్యాచారం చేసిన ఘటన..అసోంలోని నాగావ్ జిల్లాలో చోటు చేసుకుంది. సేఫ్ ఇంటికి తిరిగొస్తదనుకున్న తల్లిదండ్రులకు ప్రాణాపాయస్థితిలో ఇంటికి చేరుకుంటే తల్లిదండ్రుల పడ్డ వేదన అంతా ఇంతాకాదు..కట్టలు తెంచుకున్న ఆవేశం రోడ్లపైకి వచ్చింది.. అసోం వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి.. మానవ  మృగాలు ఆకృత్యాలను నిలదీస్తున్నాయి.  

ట్యూషన్ ముగించు కొని శుక్రవారం గురువారం ఆగస్టు 22, 2024 సాయంత్రం ఇంటికి వస్తున్న 14యేళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు అత్యాచారం చేసిన ఘటన అసోం లోని నాగావ్ జిల్లా ఢింగ్  ప్రాంతంలో చోటు చేసుకుంది.. రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడివున్న బాలికను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. మరొకరికోసం గాలిస్తున్నారు. 

బాలికపై అత్యాచారంపై అసోం వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని వర్గాల ప్రజలు శుక్రవారం రోడ్లపైకి వచ్చారు. వ్యాపారస్తులు స్వచ్ఛంగా షాపులు మూసివేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక, రాజకీయ నేతలు డిమాండ్  చేస్తూ నిరసనల్లో పాల్గొన్నారు. బాలికలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.