న్యూఢిల్లీ: ఖలిస్థానీ టెర్రరిస్ట్ లఖ్బీర్ రోడే ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) జప్తు చేసింది. బుధవారం పంజాబ్లోని మెగాలో లఖ్బీర్ సింగ్ కు సంబంధించిన ప్రాంగణాలపై ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. అతని పేరుమీదున్న ఆస్తులను, 1.4 ఎకరాల స్థలాన్ని జప్తు చేసింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
టర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ అధినేత అయిన లఖ్బీర్ సింగ్ను కేంద్ర ప్రభుత్వం టెర్రరిస్ట్గా ప్రకటించింది. ఇతను ఖలిస్థాన్ ఉద్యమానికి నాయకత్వం వహించిన జర్నైల్ సిగ్ భింద్రన్వాలే మేనల్లుడు.