కాంగో నదిలో బోటుకు మంటలు.. 16 మంది మృతి

కాంగో నదిలో బోటుకు మంటలు.. 16 మంది మృతి

కిన్షాసా: కాంగో నదిలో ప్యాసింజర్లతో వెళుతున్న బోటులో  మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది చనిపోయినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. 11 మందిని కాపాడినట్లు తెలిపారు. ఎంత మంది మిస్ అయ్యారనే దానిపై ప్రస్తుతం తమకు క్లారిటీ లేదన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. ప్రమాదానికి గురైన బోటు  జైర్ రాజధాని కిన్షాసా నుంచి ఎమ్ బడంకాకు ఫ్యూయల్(ఇంధనం) తీసుకువెళుతున్నదని పేర్కొన్నారు.

ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు. రెండు రోజుల కిందటే కాంగో నదిలో ఓ బోటు బోల్తా పడి 40 మంది మృతిచెందారు. ఖర్చు తక్కువనే కారణంతో ప్రజలు బోటు ప్రయాణం ఎంచుకోవడం,  ఓవర్‌‌లోడ్ తో బోటులను నడపటం వల్ల కాంగో నదిలో తరచూ  ప్రమాదాలు జరుగుతున్నాయి.