ఏటీఎం పగలగొట్టి రూ10 లక్షలు చోరీ

ఏటీఎం పగలగొట్టి రూ10 లక్షలు చోరీ

మోర్తాడ్, వెలుగు : నిజామాబాద్​ జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడ్ చౌరస్తా నేషనల్ హైవే 44 పక్కన ఉన్న ఎస్​బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. వ్యాగన్​ఆర్​ సిల్వర్​కలర్ ​కారులో వచ్చిన ఆగంతకులు షట్టర్​ను ఐరన్ రాడ్లతో పైకి లేపి, గ్యాస్​ కట్టర్​తో ఏటీఎంను కట్ చేశారు. అంతకుముందే సీసీ కెమెరాలపై బ్లాక్​కలర్​ స్ర్పే చేశారు. తర్వాత ఏటీఎంలోని సుమారు రూ.10 లక్షల వరకు నగదు దోచుకెళ్లినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఏటీఎం ధ్వంసం చేస్తున్నప్పుడే సర్వే లైన్స్​టీమ్ ​ద్వారా ఏటీఎం మెయింటెయిన్​ చేసే రాజ్​కుమార్​కు సమాచారం వెళ్లింది. 

దీంతో అతడు  స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్ కు చెప్పాడు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే దుండగులు నగదుతో పరారయ్యారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించిందని ఎస్ఐ చెప్పారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠానే ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ముఠా కోసం స్పెషల్​టీమ్స్​ఏర్పాటు చేసి గాలిస్తున్నామని అడిషనల్ కమిషనర్ జయరాం తెలిపారు. 

ఘటనా స్థలాన్ని ఆర్మూర్ ఏసీపీ జగదీశ్​చందర్, ఆర్మూర్ రూరల్ సీఐ గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. ఏపీ 25 ఎల్​9023 సిల్వర్​ కలర్​ వ్యాగన్ ​ఆర్​ కారును నిందితులు ఉపయోగించారని తమకు అనుమానం ఉందని, ఎక్కడైనా కనిపిస్తే డయల్​100కు కాల్​ చేసి చెప్పాలని కోరారు.