- ఫండ్ క్యాంపెయినింగ్ చేస్తున్న రిటైర్డ్ సోల్జర్ కుమార్ అజ్వానీ (61)
మనసులో బలమైన సంకల్పం ఉంటే... శరీరం సహకరిస్తుందని నిరూపించాడు 61 ఏండ్ల కుమార్ అజ్వాని. జమ్మూ కాశ్మీర్కు చెందిన ఈ రిటైర్డ్ సోల్జర్ తనలాంటి సోల్జర్స్ బాగు కోసం పాటు పడుతున్నాడు. యుద్ధంలో కాళ్లు, చేతులు కోల్పోయి దివ్యాంగులుగా మారిన సైనికుల బాగు కోసం కృషి చేస్తున్నాడు. వాళ్లను ఆర్థికంగా ఆదుకోవడం కోసం క్యాంపెయినింగ్ మొదలు పెట్టాడు. జమ్మూ నుంచి కన్యాకుమారి వరకూ ‘ఆత్మనిర్భర్ రన్’ పేరుతో రన్ చేస్తూ ఫండ్ క్యాంపెయినింగ్ చేస్తున్నాడు. ఈ ఫండ్ను దివ్యాంగులైన సోల్జర్స్కు అందించాలి అనుకుంటున్నాడు.
అజ్వానీది జమ్మూలోని ఉధంపూర్ జిల్లా.మాజీ సోల్జర్. ఆర్మీ స్పోక్స్ పర్సన్ గా కూడా పని చేశాడు.
యుద్ధాల్లో కాళ్లు చేతులు కోల్పోయి మంచాన పడ్డ సైనికులను కళ్లారా చూశాడు. వారి కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకున్నవాడు. ఈ పరిస్థితుల్లో ఉన్న దివ్యాంగ సైనికులకు సాయం చేయాలని, వారి పిల్లలకు చదువులు చెప్పించాలని తపించాడు. కేవలం జమ్మూ కాశ్మీర్లోనే కాదు. దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ సోల్జర్స్కు సాయం చేసి, వాళ్లలో మానసిక ధైర్యం నింపాలనుకున్నాడు. వారి పిల్లల బాగోగుల గురించి ఆలోచించాడు. అందుకే ‘ఆత్మనిర్భర్ రన్’ను మొదలు పెట్టాడు. నవంబర్ 19న ఉధంపూర్ జిల్లాలోని పట్నిటాప్ హిల్ రిసార్ట్ నుంచి పరుగు మొదలుపెట్టాడు.
జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు
76 రోజుల్లో 4,444 కిలోమీటర్ల దూరాన్ని చేరుకొనే పనిలో ఉన్నాడు. విద్యార్థులకు చదువు, దివ్యాంగ సోల్జర్స్కు సాయం అందించడమే అజ్వానీ లక్ష్యం. ‘‘ఈ రన్ ద్వారా వన్ ఇండియా, యూనిటీ ఇండియా అనే మెసేజ్ను అందించాలన్నది నా ఆలోచన” అంటున్నాడు. అజ్వానికి టీమ్ ఫ్యాబ్ ( ఎఫ్ఏబీ) అనే ఎన్జీఓ కూడా ఉంది. దీని ద్వారా రన్నర్ల ఫిట్నెస్ను ప్రోత్సహించడానికి వాళ్లకి కావాల్సిన అవసరాలు తీరుస్తున్నాడు అజ్వాని.