ఎవరి తండ్రిని, తాతను నేను కించపరచలేదు

ఎవరి తండ్రిని, తాతను నేను కించపరచలేదు

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అత్యధిక మోజార్టీతో విజయం సాధిస్తామన్నారు ప్రధాని మోడీ. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఏ రాష్ట్రంలోనూ తమ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని అన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనేదే మా నినాదమన్నారు. పార్లమెంట్ లో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు ప్రధాని మోడీ. ఎవరి తండ్రిని, తాతను కించపర్చలేదన్న మోడీ.. మాజీ ప్రధాని అన్న వ్యాఖ్యలనే  చెప్పానని అన్నారు. అప్పటి పరిస్థితులను..ఇప్పటి పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశానన్నారు మోడీ. ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా అక్కడ అభివృద్ధి చేశామన్నారు. గత ప్రభుత్వాలు అభివృద్ధిపై ఏ రోజు దృష్టి పెట్టలేదన్నారు. అప్పటి ప్రభుత్వాలు ఫైళ్లపై సంతకాలతో నడిచేవని..సొంత మనుషులకే లబ్ధి చేకూర్చారని అన్నారు. లఖీంపూరి ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు విచారణకు యూపీ ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. కొందరు విభజించు పాలించు పాలసీ అమలు చేశారని అన్నారు మోడీ.