మెహిదీపట్నం, వెలుగు: కరెంట్ సరఫరా నిలిచిపోయిందని విద్యుత్ శాఖ సిబ్బందిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. టప్పాచబుత్ర పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎస్సై ఆదిల్ రియాజ్ ఖాన్ తెలిసిన వివరాల ప్రకారం.. గత నెల 30న దత్తాత్రేయనగర్ మహబూబ్ కాలనీలో కరెంట్ సప్లయ్ నిలిచిపోయింది.
ఈ క్రమంలో కరెంట్ సప్లయ్ను పునరుద్ధరించడంలో ఆలస్యం కావడంతో విద్యుత్ సిబ్బంది సతీశ్, విశాల్పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. బాధితులతో పాటు సీబీడీ వింగ్ ఏడీ వంశీ కృష్ణ కంప్లయింట్ మేరకు పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులు మహమ్మద్ ఆజామ్తో పాటు మరో ఇద్దరిని గుర్తించారు. పరారీలో ఉన్నవారిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై తెలిపారు.