అత్తాపూర్: మహిళ హత్య కేసును చేధించిన పోలీసులు…

అత్తాపూర్: మహిళ హత్య కేసును చేధించిన పోలీసులు…

హైదరాబాద్: అత్తాపూర్ రాంబాగ్ లో వారంరోజుల క్రితం జరిగిన జ్యోతి కిరన్ అనే మహిళ హత్యకేసును రాజేంద్రనగర్ పోలీసులు ఛేదించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లో జ్యోతి కిరణ్ అనే మహిళను  శ్రీకాంత్ అనే వ్యక్తి హత్య చేసి కర్ణాటక లోని బీదర్ కు పారిపోయినట్లుగా పోలీసులు చెప్పారు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. దీంతో శ్రీకాంత్ కు రిమాండ్ విధించింది కోర్టు.

జ్యోతీకిరణ్ తన భర్తతో గొడవపడి గత కొంతకాలంగా  అత్తాపూర్ లోని, రాంబాగ్ లో నివాసం ఉంటుంది.  ఆమెకు శ్రీకాంత్ అనే వ్యక్తితో కొంతకాలం క్రితం పరిచయం అయింది. ఈ పరిచయం వివాహేతరసంబంధానికి దారి తీసింది. అయితే వీరిద్దరిమద్య విభేదాలు రావడంతో శ్రీనివాస్ భార్యకు జ్యోతి ఫోన్ చేసి బెదిరించింది. దీంతో ఎప్పటికైనా తనకు జ్యోతితో ముప్పు ఉంటుందని భావించిన శ్రీకాంత్… జ్యోతిని ఆమె ఇంట్లోనే హత్య చేసి ఇంటికి తాళం వేసి బీదర్ కు పారిపోయాడు. ఇంట్లోనుంచి దుర్వాసన రావడంతో ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం డాగ్స్ సి సి ఫుటేజ్ ఆధారాల సేకరించారు. దాంతో పాటు జ్యోతి ఫోన్ కాల్స్ ఆధారంగా శ్రీకాంత్ హత్య చేశాడని కనుక్కున్నారు.  జ్యోతికి ఏడు సంవత్సరాల కూతురు ఉంది.