రాజకీయ కక్షతో వ్యక్తిపై హత్యాయత్నం

రాజకీయ కక్షతో వ్యక్తిపై హత్యాయత్నం

పరిగి, వెలుగు: రాజకీయ కక్షతో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన పూడూరు మండలంలోని కండ్లపల్లిలో జరిగింది. చెన్గోముల్​ ఎస్సై భరత్​ కుమార్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్​ జిల్లా పూడూరు మండలంలోని కండ్లపల్లి గ్రామానికి చెందిన హకీం ఇటీవల జరిగిన సర్పంచ్​ ఎన్నికల్లో ఓ అభ్యర్థికి సపోర్ట్​ చేశారు. 

ఆ అభ్యర్థి ఎన్నికల్లో గెలువగా.. ఓడిపోయిన అభ్యర్థి మనుషులు హకీంపై కోపం పెంచుకున్నారు. వారంతా కలిసి కండ్లపల్లి గ్రామానికి చెందిన నాంచేరి శంకర్​ను హత్యకు ఉసిగొల్పారు. దీంతో శంకర్​.. హకీంను హత్య చేయాలని డిసైడ్​ అయ్యాడు.

మంగళవారం రాత్రి కండ్లపల్లి గ్రామంలో చాయిబంక్​ కేఫ్​ సెంటర్​కు హకీంను మాట్లాడుకుందామని పిలిచాడు. హకీం అక్కడికి వెళ్లగా తన వెంట తెచ్చుకున్న కత్తితో శంకర్​ దాడి చేశాడు. కత్తి పోటు పడగానే హకీం పరుగు తీసి తప్పించుకున్నాడు. ప్రస్తుతం బాధితుడు హైదరాబాద్​లోని ఓ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నాడు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్​రెడ్డి పరామర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.