మున్సిపల్ ఆఫీసులో అటెండర్ బర్త్ డే

మున్సిపల్ ఆఫీసులో అటెండర్ బర్త్ డే
  • సిబ్బంది సమక్షంలో అటెండర్ నర్సయ్యకు శాలువా కప్పి సత్కారం
  • మున్సిపల్ ఆఫీసులో అరుదైన దృశ్యం

జగిత్యాల మున్సిపల్ ఆఫీసులో అరుదైన దృశ్యం ఆవిష్కారమైంది. అటెండర్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వయంగా మున్సిపల్ చైర్ పర్సన్.. కమిషనర్ ఆధ్వర్యంలో సిబ్బంది అందరి సమక్షంలో వేడుకలా జరిగింది. మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి, కమిషనర్ స్వరూపరాణి  దగ్గరుండి కేక్ కట్ చేయించడమే కాదు.. ఆ తర్వాత శాలువా కప్పి సత్కరించి గౌరవించిన ఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. 
జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తున్న అటెండర్ సిరికొండ నర్సయ్య ఇవాళ పుట్టిన రోజు. కొత్త బట్టలు ధరించి రోజులానే ఆఫీసులో డ్యూటీకి వచ్చాడు. నర్సయ్య ఇవాళ తన 52వ బర్త్ డే అన్న విషయం తెలుసుకున్న మున్సిపల్ ఛైర్ పర్సన్ భోగ శ్రావణి, మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి కేక్ తెప్పించి సిబ్బంది సమక్షంలో కట్ చేయించారు. ఆ తర్వాత శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బందితోపాటు ప్రజా ప్రతినిధులు సైతం పాల్గొన్నారు. అందరూ కలసి నర్సయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తనకు దక్కిన అరుదైన గౌరవంపై అటెండర్ నర్సయ్య సంతోషం వ్యక్తం చేశారు.