సోషల్ మీడియా పోస్టులపై దృష్టి పెట్టాలి : కలెక్టర్ నారాయణరెడ్డి

సోషల్ మీడియా పోస్టులపై దృష్టి పెట్టాలి :   కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్, వెలుగు: జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు పారదర్శంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకారం అందించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి కోరారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో  మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) మీడియా సెంటర్ ను బుధవారం ఆయన కలెక్టరేట్ లో ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సెంటర్ అధికారులకు సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాస్థాయిలో  సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.  అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, డీపీఆర్ వో చెన్నమ్మ,  ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు.