హైదరాబాద్, వెలుగు: విశాక గ్రూపుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ ఆటమ్ చార్జ్ ముంబైలోని మలాడ్లో ఈవీ చార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసింది. సోలార్ రూఫ్ ద్వారా కరెంటు తీసుకొని నడిచే ఎలక్ట్రిక్ వెహికల్ యూనివర్సల్ చార్జింగ్ స్టేషన్ ఇది. కో–-వర్కింగ్ స్పేస్గానూ పని చేస్తుంది. బండి చార్జ్ అవుతున్న సమయంలో ఇక్కడే కూర్చొని పనిచేసుకోవచ్చు. ఆటమ్ చార్జ్ ఇది వరకే దేశవ్యాప్తంగా 250 చార్జింగ్ స్టేషన్లను విజయవంతంగా ఇన్స్టాల్ చేసింది. ఇందులో 5.2 కిలోవాట్స్ కెపాసిటీ గల ఆటమ్ సోలార్ రూఫ్ ద్వారా బ్యాటరీలు చార్జ్ అవుతాయి. ఆటమ్ సోలార్ ప్రపంచంలోనే మొదటిసారిగా సోలార్ రూఫ్ను తయారు చేసింది. అమెరికా, దక్షిణాఫ్రికాలో దీనికి పేటెంట్లు కూడా ఉన్నాయి. యూనివర్సల్ ఈవీ చార్జింగ్ స్టేషన్లు ప్రారంభించడం ద్వారా ఆటమ్ చార్జ్ పర్యావరణానికి ఎంతో మేలు చేస్తోంది. మిగతా కంపెనీలు ఈవీ చార్జింగ్ స్టేషన్లు సాధారణ కరెంటును వాడుకుంటున్నాయి. ఆటమ్సోలార్ మాడ్యూల్స్ రోజుకు 24 కిలోవాట్అవర్స్, సంవత్సరానికి 8,760 కిలోవాట్అవర్స్ కరెంటును ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల పరోక్షంగా 51 చెట్లను నరికివేయకుండా కాపాడవచ్చు. అంతేగాక 4395 కిలోల మేర కార్బన్వాయువులను తగ్గించవచ్చు. మలాడ్లో తమ సరికొత్త ఈవీ చార్జింగ్ స్టేషన్ను ప్రారంభించడం గురించి విశాక జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గడ్డం మాట్లాడుతూ, “మా ఎక్స్పర్టులు, ఆర్&డీ టీమ్ సాయంతో మేం కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాం.
సోలార్ ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ల ద్వారా ముంబైలో పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇంతకుముందు కంటే ఇప్పుడు మనం మరింత పర్యావరణ స్పృహతో ఉండాలి. వాతావరణ సమస్యల గురించి ప్రజల్లో ఇప్పటికే చాలా అవగాహన వచ్చింది. సోలార్స్టేషన్ల ఏర్పాటు ద్వారా పచ్చదనం, ఆరోగ్యకరమైన భారతదేశం అనే మా టార్గెట్ వైపు మరో అడుగువేశాం. ఈ విజయానికి గుర్తుగా కంపెనీ పూజా వేడుకలనూ నిర్వహించింది. దీని తర్వాత భారీ ప్రారంభోత్సవం ఉంటుంది”అని అన్నారు. ఈ పూజలో విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జేపీ రావుతో పాటు విశాక ఎంప్లాయీస్ పాల్గొన్నారు.