
న్యూఢిల్లీ: అరబిందో ఫార్మా సోమవారం మార్చి 2025తో ముగిసిన నాలుగో క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. కంపెనీ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ రూ.903 కోట్లకు చేరుకుంది. కిందటేడాది మార్చి క్వార్టర్లో రూ.907 కోట్ల నికర లాభం నమోదు చేసింది. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, నాలుగో క్వార్టర్లో కంపెనీ రెవెన్యూ రూ.7,580 కోట్ల నుంచి రూ.8,382 కోట్లకు చేరుకుంది. మార్చి 31, 2025తో ముగిసిన పూర్తి ఫైనాన్షియల్ ఇయర్లో అరబిందో ఫార్మాకు రూ.3,484 కోట్ల నికర లాభం రాగా, రెవెన్యూ రూ.31,724 కోట్లకు పెరిగింది. ఆల్-టైమ్ హై సేల్స్, ఇబిటా సాధించామని అరబిందో ఫార్మా వైస్ -చైర్మన్ కె. నిత్యానంద రెడ్డి పేర్కొన్నారు. కంపెనీ యూరోపియన్ బిజినెస్ మంచి పనితీరు కనబరిచిందని అన్నారు.