
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ రెండో రోజు ఆటలో భారత్ బౌలర్లు పుంజుకున్నారు. ఫస్ట్ సెషన్ లోనే నాలుగు కీలకమైన వికెట్లు తీశారు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ట్రావిస్ హెడ్ (163)ను సిరాజ్ ఔట్ చేశాడు. హెడ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్ (6) కూడా త్వరగానే ఔటయ్యాడు. షమి బౌలింగ్ లో స్లిప్లో శుభ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఇక క్రీజులో పాతుకుపోయిన స్టీవ్ స్మిత్ (121) శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో బౌల్ట్ అయ్యాడు. ఆ తరువాత అక్షర్ పటేల్ అద్భుతమైన ఫీల్డింగ్తో మిచెల్ స్టార్క్ (5) రనౌట్గా పెవిలియన్ చేరాడు. దీంతో 402 పరుగులకే ఆసీస్ 7 వికెట్లు కొల్పోయింది. ప్రస్తుతం క్రీజ్ లో అలెక్స్ కేరీ (13), పాట్ కమిన్స్(0) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.