
హైదరాబాద్, వెలుగు : ఆస్ట్రేలియా, ఇండియా బిజినెస్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆస్ట్రేలియన్ డిజిటల్ హెల్త్, ట్రేడ్ మిషన్ సభ్యులు బుధవారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషనర్ అబ్దుల్ ఎక్రామ్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ డివైజ్లు, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్లలో భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడం పర్యటన ఉద్దేశమన్నారు.
సెప్టెంబరు 1 నుంచి 6వ తేదీల మధ్య ముంబై, చెన్నై, హైదరాబాద్లోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్కేర్ హాస్పిటల్స్, ఫార్మాస్యూటికల్ తయారీదారులు, టెలీ హెల్త్, రిమోట్ హెల్త్ సర్వీస్ ప్రొవైడర్లతో ప్రతినిధి బృందం సమావేశమైందని ఆయన వివరించారు.