నల్లా నీటిని వృథా చేసిన మహిళకు రూ. వెయ్యి ఫైన్

నల్లా నీటిని వృథా చేసిన మహిళకు రూ. వెయ్యి ఫైన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: వాటర్​బోర్డు సప్లయ్​ చేస్తున్న తాగునీటిని వృథా చేసిన మహిళకు అధికారులు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. ఈ నెల 5న ఇలాగే జూబ్లీహిల్స్ లోని ఇంటి ముందు నల్లా నీటితో బైక్​వాష్​చేసిన వ్యక్తికి రూ.వెయ్యి ఫైన్​వేశారు. 

తాజాగా జూబ్లీహిల్స్​జర్నలిస్టు కాలనీలోని ఇంట్లో నల్లా తిప్పి వదిలేయడంతో నీరంతా వృథాగా పోయింది. రోడ్డుపై నీరు పారడాన్ని గుర్తించిన స్థానికులు వాటర్​బోర్డు క‌‌‌‌స్టమ‌‌‌‌ర్ కేర్ కు ఫోన్​చేసి ఫిర్యాదు చేశారు. ఓఅండ్ఎం డివిజ‌‌‌‌న్-–6 జీఎం హ‌‌‌‌రిశంక‌‌‌‌ర్ తన మేనేజ‌‌‌‌ర్ తో క‌‌‌‌లిసి త‌‌‌‌నిఖీ చేయగా, యరత శోభ అనే మహిళ ఇంట్లోని నల్లా తిప్పి వదిలేసిందని గుర్తించారు. ఆమెకు  రూ.1000 ఫైన్ వేశారు.