హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్లో పన్నెండేండ్ల నుంచి ఆటో మీటర్చార్జీలు పెంచలేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో చార్జీలను పెంచాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్యూనియన్జాయింట్యాక్షన్ కమిటీ డిమాండ్చేసింది. గురువారం ఆర్టీఏ జాయింట్కమిషనర్ రమేశ్కు యూనియన్నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు బి.వెంకటేశం, ఎంఎ సలీం, ఎ.సత్తిరెడ్డి, మారయ్య, ప్రవీణ్, మల్లేశ్గౌడ్, శ్రీకాంత్మాట్లాడుతూ.. పెరిగిన పెట్రోల్, డీజిల్, ఆయిల్, గ్యాస్నిత్యవసర ధరలకు అనుగుణంగా ఆటో చార్జీలను కూడా పెంచే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
చార్జీలను పెంచకపోవడం వల్ల ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్ర్కాప్ పాలసీని పాతపద్దతిలోనే కొనసాగించాలని, ఓఆర్ఆర్పరిధిలో 20 వేల ఆటోలకు వెంటనే పర్మిట్లు ఇవ్వాలని, ఆటో డ్రైవర్లకు సంత్సరానికి 12వేల సాయం అందించాలని కోరారు. ఆటో, రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ఓలా, ఊబర్, రాపిడో యాప్లను నిషేధించి కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు.
