కాంగ్రెస్ గెలిస్తే రూ.2 లక్షల రుణమాఫీ: ఆవుల రాజిరెడ్డి 

కాంగ్రెస్ గెలిస్తే రూ.2 లక్షల రుణమాఫీ: ఆవుల రాజిరెడ్డి 

మెదక్​ (చిలప్ చెడ్), వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నర్సాపూర్​ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని చిట్కుల్, బంజారా తండా, బద్రియ తండా, చంద్రియ తండా, గౌతాపూర్, చండూర్, చిలప్ చెడ్, జగ్గంపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అభివృద్ధి చేసినదానికంటే దోచుకున్నదే ఎక్కువ అని ఆరోపించారు.

 రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూం ఇండ్ల హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు పాండరి, విష్ణువర్ధన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శశికాంత్, శ్రీనివాస్ రెడ్డి, హంసిబాయ్, సుధీర్ రెడ్డి, శేష సాయిరెడ్డి, యువసేన నాయకులు పాల్గొన్నారు.

కౌడిపల్లి: బీఆర్ఎస్ కు చెందిన కొట్టాల సర్పంచ్ గోరకంటి నరహరి, వార్డు మెంబర్లు అంబూరి లక్ష్మి, మంగలి సురేఖ, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బండారి ఆంజనేయులు తో పాటు బీఆర్ఎస్ నాయకులు, ముదిరాజ్ సంఘం సభ్యులు దాదాపు 300 మంది రాజిరెడ్డి ఆధ్వర్యంలో  కాంగ్రెస్ లో చేరారు.