ఇయ్యాల 47 పంచాయతీలకు అవార్డుల ప్రదానం

ఇయ్యాల 47 పంచాయతీలకు అవార్డుల ప్రదానం

హైదరాబాద్, వెలుగు: వివిధ అంశాల్లో ఉత్త మ పనితీరు కనబర్చిన గ్రామ పంచాయతీలకు అవార్డులు దక్కాయి. శుక్రవారం రాజేంద్ర నగర్ లోని జయశంకర్ అగ్రికల్చర్ యూనివ ర్సిటీలో జరిగే ప్రోగ్రాంలో మంత్రులు కేటీ ఆర్, దయాకర్ రావు అవార్డులను సర్పంచ్ లు, సెక్రటరీలకు అందజేయనున్నారు.

పేదరి కం లేని, చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామం, మహిళా స్నేహపూర్వక పంచాయతీ, సుపరిపాలన గ్రామం, ఆరోగ్యకరమైన పంచాయతీ, స్వయం సమృ ద్ధి, మౌలిక సదుపాయాలు ఉన్న గ్రామం, సామాజిక భద్రత ఉన్న గ్రామం, నీరు సమృద్ధిగా ఉన్న గ్రామం, పరిశుభ్రత ఉన్న గ్రామం ఇలా 11 కేటగిరీల్లో 47 గ్రామ పంచాయతీలు అవార్డులకు ఎంపికయ్యాయి. కాగా, స్త్రీనిధి కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ 10వ జనరల్ బాడీ మీటింగ్ శుక్రవారం మాదాపూర్ లోని శిల్పారామంలో జరగనుంది.