
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాదీ అంబటి రాయుడు కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో బరిలోకి దిగబోతున్నాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ టీమ్తో ఒప్పందం చేసుకున్నాడు. దాంతో, సీనియర్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే తర్వాత సీపీఎల్లో ఆడబోతున్న ఇండియా రెండో క్రికెటర్గా నిలిచాడు. గత సీజన్తో తన ఐపీఎల్ కెరీర్ ముగించిన అంబటి అమెరికాలోని మేజర్ క్రికెట్ లీగ్లో టెక్సాస్ సూపర్ కింగ్స్తో కూడా ఒప్పందం చేసుకున్నాడు. అయితే, ఇండియా క్రికెటర్లు రిటైర్మెంట్ ఇచ్చిన వెంటనే ఫారిన్ లీగ్స్లో పాల్గొనకుండా కూలింగ్-ఆఫ్ పీరియడ్ పాలసీపై ఆలోచిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించడంతో రాయుడు మేజర్ లీగ్లో పాల్గొనలేదు. ఈ విషయంపై బోర్డు ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు.