టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. స్కిల్ డెవల్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టును టిడిపి నాయకులు, కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు, చంద్రబాబుపై వైసిపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని నారా లోకేశ్ రాష్ట్రపతితోపాటు కేంద్ర పెద్దలను కలిశారు.
Also Read :- శ్రీశైలం డ్యాం మీదుగా కొత్తగా ఐకానిక్ బ్రిడ్జి
ఈ ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. అమిత్ షాను కలిసింది బీజేపీలో పార్టీని విలీనం చేయడానికేగా లోకేశ్? అని ఎక్స్ వేదిక అంబటి ఎద్దేవా చేశారు. దీంతో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఎక్స్ లో స్పందిస్తూ... బీజేపీలో విలీనం చేయడానికి కాదు... సుకన్య ఎవరో కనుక్కోండి అని అమిత్ షాను అడిగారని అంబటికి కౌంటర్ ఇచ్చారు. కాగా, చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో వైసిపి, టిడిపి పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది.