దీపావళి వేడుకల్లో భాగంగా 22లక్షల 23వేలు దీపాలు (మట్టి దీపాలు) వెలిగించిన తర్వాత అయోధ్యలో దీపోత్సవ్ ఉత్సవం మరోసారి ప్రపంచ రికార్డు సృష్టించింది. దీపోత్సవ్ సందర్భంగా, రామ్ కి పైరిపై 24 లక్షల 'దియాలు' (మట్టి దీపాలు) వెలిగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ .. ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే అందరికీ ఒకే కోరిక ఉన్నట్టు అనిపిస్తోందని, అది రామ మందిరం నిర్మాణమేనని చెప్పారు.
"రాముడి ఆలయం (రామ మందిరం) నిర్మాణం గత 9.5 సంవత్సరాలలో భారతదేశంలో ప్రధాని మోదీ చేత స్థాపించబడిన 'రామరాజ్యం' పునాదిని బలపరుస్తుంది" అని యోగి అన్నారు. ఇక్కడ రామమందిరం రాబోతున్నందున నగరాన్ని అభివృద్ధి చేయడానికి, అయోధ్య రూపురేఖలను మార్చడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా, అయోధ్యలోని రామజన్మభూమిలో రామ్ లల్లా స్వామికి భక్తులు ప్రార్థనలు చేశారు.
#अयोध्या में पुनः स्थापित हुआ कीर्तिमान!
— UP Tourism (@uptourismgov) November 11, 2023
आध्यात्मिक नगरी श्री अयोध्या जी में #दीपोत्सव के पावन पर्व पर 22 लाख 23 हजार दीपों की श्रृंखला से पुनः विश्व रिकॉर्ड बनाया गया।
समस्त प्रदेशवासियों को हार्दिक बधाई!
जय जय #श्रीराम..#GuinnessWorldRecords #Deepotsav2023 #Ayodhya pic.twitter.com/ELw3eaSUIp