ఆయుర్వేద స్టూడెంట్ ఆత్మహత్య

ఆయుర్వేద స్టూడెంట్ ఆత్మహత్య

ఖైరతాబాద్, వెలుగు : ఆయుర్వేద స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా విఠలాపూర్​కు చెందిన జగదీశ్(23) ఎర్రగడ్డలోని బీఆర్కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కాలేజీలో బీఏఎంఎస్ ఫస్టియర్ చదువుతున్నాడు. మధురానగర్ పరిధి జవహర్​నగర్​లో ఫ్రెండ్​తో కలిసి ఉంటున్నాడు. బుధవారం ఉదయం కొండాపూర్​లోని బంధువు రూమ్​కు వెళ్లిన జగదీశ్ అక్కడ ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు కారణాలు తెలియదని పోలీసులు తెలిపారు.