
శుక్రవారం ( జూన్ 27 ) విజయవాడలో జరిగిన టూరిజం కాంక్లేవ్ టెక్ AI 2.0లో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు ప్రముఖ యోగ గురు బాబా రాందేవ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక పాలసీ ఉందని అన్నారు. క్రియేటివిటీ, ప్రొడక్టివిటీ, ప్రొఫెషనలిజం, ఎఫిషియన్సీ లాంటి అంశాలకు కేరాఫ్ అడ్రస్ సీఎం చంద్రబాబు అని కొనియాడారు. ఆయనంత సద్గుణ సంపన్నమైన దార్శనికమైన నాయకుడు దేశంలో ఎవరు లేరని అన్నారు బాబా రాందేవ్. తెలుగు ప్రజలకు దేవుడు పంపించిన వరదానం చంద్రబాబు నాయుడని అన్నారు.
చంద్రబాబు చేసేంత విజన్ మరెవరూ చేయటం లేదని కచ్చితంగా చెప్పగలనని అన్నారు.యోగా ఆయుర్వేద, నేచురోపతి లాంటి అంశాలు పర్యాటక ప్రాంతాల్లో అవసరమని అన్నారు. హార్సిలీ హిల్స్, అరకు, విశాఖ, రాజమహేంద్రమరం, పిచ్చుకలంక, సూర్యలంక లాంటి మంచి ప్రాంతాలు ఏపీలో ఉన్నాయని.. పారిస్, స్విట్జర్లాండ్, టర్కీ లాంటి దేశాలకు పర్యాటకం కోసం వెళ్తున్నాం కానీ మనదేశంలోనే మరిన్ని అందాలున్నాయని అన్నారు బాబా రాందేవ్. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో అంతకంటే సుందరమైన ప్రాంతాలు ఉన్నాయని అన్నారు.
వీటిని అభివృద్ధి చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని.. నదీ తీరం, సముద్ర తీరాలు, సుందరమైన ప్రకృతి వనరులు చాలా ఉన్నాయని అన్నారు.దిండి లాంటి ప్రాంతాల్లో వెడ్డింగ్ క్రూయిజ్, బోట్ లాంటి ప్రాజెక్టు చేపడతామని.. వెడ్డింగ్ డెస్టినేషన్ గా ఈ ప్రాంతాన్ని మార్చాలని ఆసక్తి చూపిస్తున్నామని అన్నారు బాబా రాందేవ్.భారతీయ సంప్రదాయ పరంగా వివాహాలు జరిపించేలా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రాజెక్టు ఉంటుందని అన్నారు.
ఏపీలో పతంజలి సంస్థ వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోందని అన్నారు. సీఎం చంద్రబాబు ఈ వయస్సులోనూ ఎంతో చలాకీగా నిర్ణయాలు, పాలన చేస్తున్నారని.. చంద్రబాబు తన బయోలాజికల్ వయస్సును రివర్స్ చేసేశారని అన్నారు.హార్సిలీ హిల్స్ ను ప్రపంచ ఐకానిక్ వెల్ నెస్ సెంటర్ గా మారుస్తామని.. ఏపీ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు బాబా రాందేవ్.ఉత్తర భారత్ వాసులకు ఏపీలో ఉన్న పర్యాటక ప్రాంతాలు చాలా తెలియవని..వాటి గురించి పరిచయం చేయాలని నేను భావిస్తున్నానని అన్నారు.
ఏపీని ప్రపంచ పర్యాటక మ్యాప్ లో నెంబర్ వన్ గా మార్చాలని.. దేశంలోని చాలా వైవిధ్యమైన ప్రాంతాలు ఉన్నాయిని అన్నారు. హార్సిలీ హిల్స్ లో ఉంటే.. హిమాలయాల్లో ఉన్నట్టుగా చల్లని వాతావరణంతో ఉందని అన్నారు బాబా రాందేవ్. అన్ని రకాల వాతావరణం ఏపీలో ఉందని.. ఏపీలో పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక విజన్ అమలు చేస్తున్నారని అన్నారు.హరిద్వార్ నుంచి తెచ్చిన పవిత్ర గంగాజలాన్ని సీఎం చంద్రబాబుకు సమర్పించారు బాబా రాందేవ్.