ప్రచారంలో పాట పాడి, స్టెప్పులేసిన బాబు మోహన్

ప్రచారంలో పాట పాడి, స్టెప్పులేసిన బాబు మోహన్

ప్రచారంలో పాట పాడి, స్టెప్పులేసిన బాబు మోహన్
జమ్మికుంట : సీఎం కేసీఆర్ ఫ్యామిలీ అబద్దాల కోరు అన్నారు మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబు మోహన్. హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జమ్మికుంటలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాబు మోహన్.. కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి దగ్గరినుండి ఇప్పటిదాకా చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు.  ఈటల రాజేందర్ కు అన్యాయం జరిగిందన్నారు. ఈ ఎన్నికతో ధర్మం గెలవాలంటే ఈటల రాజేందర్ ను బంపర్ మెజార్టీతో గెలిపించాలన్నారు. సభలో మాట్లాడుతూనే బాబు మోహన్ పాటతో ఉర్రూతలూగించారు. చినుకు చినుకు అందెలతో పాట పాడుతూ స్ట్టెప్పులు వేశారు.