
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా వేంపల్లెలో పుట్టిన ఇద్దరికి కరోనా పేర్లు కలిసి వచ్చేలా పేర్లు పెట్టారు. అలిరెడ్డిపల్లెకు చెందిన రమాదేవి, తాళ్లపల్లెకు చెందిన శశికళ పురిటి నొప్పులతో పట్టణంలోని బాషా ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఒకరికి అబ్బాయి జన్మించగా, మరొకరికి అమ్మాయి పుట్టింది. ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ బాషా పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టారు. అబ్బాయికి కరోనా కుమార్, అమ్మాయికి కరోనా కుమారి గా నామకరణం చేశారు. వారి తల్లిదండ్రులు కూడా ఓకే చెప్పడంతో ఆ పేర్లనే ఖాయం చేశారు.
గతంలోనూ ఇలాంటి సందర్భాలు జరిగాయి. అప్పట్లో అమెరికా తొలి స్పేస్ స్టేషన్ స్కైలాబ్ 1979లో హిందూ మహాసముద్రంలో కుప్పకూలింది. ఆ సమయంలో పుట్టిన వారికి ‘స్కైలాబ్’ అనే పేర్లు పెట్టారు.