పంచాంగం: ఈ ఏడాది ప్రభుత్వానికి గట్టి సవాళ్లే

పంచాంగం:  ఈ ఏడాది ప్రభుత్వానికి గట్టి సవాళ్లే

చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణమే ప్లవ నామ సంవత్సరం అన్నారు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి. రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయన పంచాంగం చదివారు. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంచాంగాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రప్రభుత్వానికి ఈ ఏడాది సవాళ్లు గట్టిగానే ఉంటాయన్నారు బాచంపల్లి సంతోష్ శాస్త్రి. అయితే ఆ ఒత్తిడిని ప్రభుత్వం అధిగమిస్తుందన్నారు. వచ్చేనెల అయ్యేసరికి కరోనా అంతం అవుతుందన్నారు. ఐనప్పటికీ ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఏడాది రైతులకు బాగుంటుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధి ఉంటుందన్నారు. అన్నింటా స్త్రీల ఆధిపత్యమే కొనసాగుతుందన్నారు బాచంపల్లి శాస్త్రి.