
- 150 కుటుంబాలు ఎలా ఉండగలం
జీడిమెట్ల, వెలుగు: బాచుపల్లి ఇంద్రానగర్ గుడిసెవాసులు అధికారుల తీరుపై మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షానికి బాచుపల్లిలోని బైరన్ చెరువు నిండి బ్యాక్ వాటర్ ఇంద్రానగర్లోని ఇండ్లలోకి వచ్చి చేరింది. ఇక్కడ 40 ఏళ్లుగా మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్కు చెందిన 150 గిరిజన వలస కూలీలు గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారు.
ఇండ్లలోకి నీరు రావడంతో వీరిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. తలదాచుకోవడానికి అంగన్వాడీ కేంద్రాన్ని సూచించారు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. 150 కుటుంబాలు చిన్న అంగన్వాడీ కేంద్రంలో ఎలా ఉంటారని ప్రశ్నించారు. ప్రతీసారి ఇదే సమస్య ఎదురవుతుందని, ప్రత్యామ్నాయంగా తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టివ్వాలని, లేదంటే వేరే చోట 60 గజాల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు.