
హైదరాబాద్ పటాన్ చెరువు బస్టాండ్లో విషాద ఘటన జరిగింది. బస్సు ఎక్కుతూ జారిపడిన ఓ వ్యక్తి మృతి చెందాడు.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పటాన్ చెరువు బస్టాండ్లో జాన్ మహమ్మద్ అనే వ్యక్తి బస్సు ఎక్కుతూ కాలు జారి బస్సు వెనుక చక్రం కిందపడ్డాడు. మెదక్ డిపోకు చెందిన బస్సు కిందపడ్డాడు.తీవ్రగాయాలుకావడంతో.. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకు సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రయాణికుడు జాన్ మహమ్మద్ మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పటాన్ చెరువు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పటాన్ చెరువులో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.