
Gold Price Today: అమెరికాలోని ట్రేడ్ కోర్టు ట్రంప్ ప్రకటించిన సుంకాలపై స్టే ఇస్తూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ట్రంప్ ప్రభుత్వం అప్పీల్ తర్వాత ప్రెసిడెంట్ తన ఎమర్జెన్సీ పవర్స్ ఉపయోగాన్ని కోర్టు సమర్థిస్తూ సుంకాల నిలుపుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీంతో అంతర్జాతీయంగా నిన్న తగ్గిన పసిడి ధరలు నేడు తిరిగి పెరగటం స్టార్ట్ అయ్యాయి. అయితే ఒక్కరోజులోనే కోర్టు తన తీర్పును మార్చేయటం పసిడి పెట్టుబడిదారులను షాక్ కి గురిచేసింది. దీంతో నేడు తగ్గాల్సిన గోల్డ్ రేట్లు మళ్లీ తిరిగి పుంజుకున్నాయి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.2వేల 500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 920, ముంబైలో రూ.8వేల 920, దిల్లీలో రూ.8వేల 935, కలకత్తాలో రూ.8వేల 920, బెంగళూరులో రూ.8వేల 920, కేరళలో రూ.8వేల 920, పూణేలో రూ.8వేల 920, వడోదరలో రూ.8వేల 925, జైపూరులో రూ.8వేల 935, లక్నోలో రూ.8వేల 935, మంగళూరులో రూ.8వేల 920, నాశిక్ లో రూ.8వేల 823, అయోధ్యలో రూ.8వేల 935, బళ్లారిలో రూ.8వేల 920, నోయిడాలో రూ.8వేల 935, గురుగ్రాములో రూ.8వేల 935 వద్ద కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.2వేల 700 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ రేట్లను చూస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 731, ముంబైలో రూ.9వేల 731, దిల్లీలో రూ.9వేల 746, కలకత్తాలో రూ.9వేల 731, బెంగళూరులో రూ.9వేల 731, కేరళలో రూ.9వేల 731, పూణేలో రూ.9వేల 731, వడోదరలో రూ.9వేల 736, జైపూరులో రూ.9వేల 746, లక్నోలో రూ.9వేల 746, మంగళూరులో రూ.9వేల 731, నాశిక్ లో రూ.9వేల 734, అయోధ్యలో రూ.9వేల 746, బళ్లారిలో రూ.9వేల 731, నోయిడాలో రూ.9వేల 746, గురుగ్రాములో రూ.9వేల 746గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.89వేల 200 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.97వేల 310గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 10వేల 900 వద్ద ఉంది.