ఢిల్లీ లిక్కర్ స్కామ్ : బుచ్చిబాబుకు బెయిల్ 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : బుచ్చిబాబుకు బెయిల్ 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరెస్ట్ అయిన గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ మంజూరు అయింది. రూ. 2 లక్షల పూచీకత్తుపై  ఆయనకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ ఇచ్చింది. పాస్ పోర్టును అధికారులకు అప్పగించాలని ఆదేశించింది. ప్రస్తుతం బుచ్చిబాబు  తీహార్ జైలులో ఉన్నాడు. కాగా గత నెల ఫిబ్రవరి 8 న బుచ్చిబాబుును సీబీఐ ఆరెస్ట్ అయింది. మద్యం విధానం రూపకల్పనలో హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు భారీగా లబ్ధి చేకూరే విధంగా బుచ్చిబాబు వ్యవహరించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.