ఈ వారం (2025 డిసెంబర్ 5), టాలీవుడ్లో అఖండ ఘట్టం మొదలవ్వనుంది. బాలకృష్ణ-బోయపాటిల మాస్ తాండవం అఖండ 2 .. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాపై ఉన్న క్రేజ్ను దృష్టిలో ఉంచుకుని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'అఖండ 2' టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రత్యేక అనుమతులు జారీ చేసింది.
ఈ క్రమంలోనే బుధవారం (డిసెంబర్ 3న) ఆంధ్రప్రదేశ్లో అఖండ 2 బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. నైజాంలో మాత్రం ఇవాళ సాయంత్రానికి బుకింగ్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే, టికెట్ ధరలపై, స్పెషల్ షోల అనుమతిపై కూడా అప్డేట్ రానుంది.
#Akhanda2 BOOKINGS NOW OPEN all across Andhra Pradesh ❤🔥❤🔥
— 14 Reels Plus (@14ReelsPlus) December 3, 2025
🎟️https://t.co/FmCbOXEGGN
Enjoy the DIVINE MASS on the big screens 💥
In cinemas worldwide on December 5th.#Akhanda2Thaandavam
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial @MusicThaman… pic.twitter.com/oqWd9lvi7o
2021లో సంచలనం సృష్టించిన 'అఖండ'కు సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కింది. డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాని సుమారు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్తో, ప్యాన్-ఇండియా స్థాయిలో రూపొందించారు. ఇందులో బాలకృష్ణ అఘోర, మురళీ కృష్ణ అనే రెండు పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశారు. ట్రైలర్, గ్లింప్స్ను ఇప్పటికే అంచనాలను రెట్టింపు చేశాయి.
బాలకృష్ణ పవర్-ప్యాక్డ్ డైలాగ్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, బోయపాటి సనాతన కాన్సెప్ట్, థమన్ మ్యూజిక్ సినిమాకు హైలెట్గా నిలవనున్నాయి. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ రోల్లో కనిపించనున్నాడు. బాలయ్య డాటర్ తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు.
అఖండ 2 ఏపీ టికెట్ రేట్స్:
సింగిల్ స్క్రీన్లలో రూ.75, మల్టీప్లెక్స్లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) ధర పెంచుకునేందుకు వెసులుబాటు లభించింది. డిసెంబరు 4న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్ షోలకు కూడా అనుమతి లభించింది. ఈ ప్రీమియర్ టికెట్ ధరను ఏకంగా రూ.600 (జీఎస్టీతో కలిపి) గా నిర్ణయించారు. రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పెంచిన ధరలు విడుదల తేదీ నుంచి 10 రోజుల పాటు అమల్లో ఉంటాయి. ఈ నిర్ణయంతో తొలి పది రోజుల్లోనే ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉంది.
