సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వీర సింహారెడ్డి

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వీర సింహారెడ్డి

‘వీర సింహారెడ్డి’గా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు బాలకృష్ణ. ఆల్రెడీ జై బాలయ్య, సుగుణాల సుందరి అంటూ రెండు పాటలతో అంచనాలు పెంచారు. ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయ్’ అనే స్పెషల్ సాంగ్‌‌ను శనివారం  హైదరాబాద్‌‌లోని సంధ్య 35ఎంఎం థియేటర్‌‌‌‌లో  రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ‘ఇప్పుడు చూసిన సాంగ్ జస్ట్ శాంపిల్ మాత్రమే. 

ఇందులో ఒక సిగరెట్ స్టెప్ , సోడా స్టెప్ మామూలుగా ఉండదు. ఫ్యాన్స్‌‌కి పండగే’ అన్నాడు. ‘‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’ రెండు కలిపితే ఎలా ఉంటుందో అదే వీరసింహారెడ్డి’’ అన్నారు నిర్మాత వై.రవిశంకర్. దర్శకనిర్మాతలు చెప్పినట్టుగానే ఈ స్పెషల్ సాంగ్‌‌లో బాలకృష్ణ, చంద్రిక రవి మాస్ మూమెంట్స్‌‌తో మెస్మరైజ్ చేస్తున్నారు. ‘చుడీదార్ ఇష్టం అంట ఆడికి.. వద్దొద్దన్నా ఎండకాలం వీడికి. 

ఏంచక్క తెల్లచీర కట్టి.. జళ్లో మల్లె పూలు చుట్టి.. వెళ్లేలోపే ముఖం ముడుసుకున్నడే. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే..’అంటూ సాగే పాటకు తమన్ ట్యూన్ చేయగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. సాహితి చాగంటి, సత్య యామిని, రేణు కుమార్ కలిసి పాడారు. శేఖర్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేశాడు.  శ్రుతిహాసన్ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌‌కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.