ఎన్నికల మీద ఫోకస్.. కరోనా కట్టడి ఫసక్..

ఎన్నికల మీద ఫోకస్.. కరోనా కట్టడి ఫసక్..

ఫోకస్​ అంతా.. ఎన్నికల మీదే

ఎలక్షన్స్​ పనుల్లో అధికారులు బిజీ బిజీ

హెల్త్ ​బులెటిన్​లో మారని కంటెయిన్​మెంట్​ జోన్లు

ఐసోలేషన్​ సెంటర్ల ఏర్పాటుపై నిర్లక్ష్యం

ప్రత్యేకాధికారులకు నోడల్ ​ఆఫీసర్లుగా ​బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​లో కరోనా కేసులు వందల్లో వస్తున్నా బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు. వైరస్​ వ్యాప్తిని కంట్రోల్​ చేయడం వదిలేసి జీహెచ్​ఎంసీ ఎన్నికల మీద ఫోకస్​ పెట్టారు. కొద్దిరోజుల నుంచి అదే పనిలో బిజీగా ఉన్నారు. 2021 ఫిబ్రవరికి ఇప్పటి పాలక మండలి టైం ​ముగుస్తుండడంతో ఎలక్షన్స్​కి ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో కంటెయిన్​మెంట్​ జోన్లు ఏర్పాటు చేయాలన్న కేంద్రం గైడ్​లైన్స్​నూ పక్కన పెట్టేశారు.

కేసులు పెరుగుతున్నా…

గ్రేటర్​లో 82  కంటైన్​మెంట్​ జోన్లు ఉన్నట్లు డైరెక్టర్​ఆఫ్ హెల్త్ బులిటెన్​లో చూపిస్తున్నా, నెల రోజుల నుంచి అవే ఏరియాలు ఉంటున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే గ్రేటర్​లో ఇప్పటివరకు 58,922 వేల కేసులు నమోదయ్యాయి. డైలీ వందల్లో వస్తూనే ఉన్నాయి. ఈ నెలలో 7,363 కేసులు వచ్చాయి. బులిటెన్​లో చూపని కేసులు అంతకు రెట్టింపే ఉన్నాయి. అయినా కంటెయిన్​మెంట్ల జోన్లలో ఎలాంటి మార్పులూ ఉండడం లేదు.  జోన్లలో పటిష్ట చర్యలు తీసుకోవాలన్న కేంద్రం ఆదేశాలనూ బల్దియా అధికారులు లెక్క చేయడం లేదు. కరోనా ప్రారంభంలో హడావిడి చేసినా.. ఇప్పుడు మొత్తానికే చేతులెత్తేశారు. అప్పట్లో డైలీ మీటింగ్​లు పెట్టి, పరిస్థితులు సమీక్షించేవారు. ప్రస్తుతం సమావేశాల మాటే మర్చిపోయారు. కమిషనర్​తోపాటు జోనల్​ కమిషనర్లు బల్దియా ఎన్నికలపైనే దృష్టి పెట్టారు. కంటెయిన్​మెంట్​జోన్లకు స్పెషల్​ఆఫీసర్లుగా ఉన్న ఎనిమిది మంది అధికారులను కమిషనర్​ ఇప్పుడు ఎన్నికల ఎన్నికల నోడల్​ ఆఫీసర్లుగా నియమించారు.

పాజిటివ్ వచ్చినా పట్టించుకోట్లే

కరోనా పాజిటివ్​వచ్చి హోమ్ ఐసోలేషన్​లో ఉన్న వారికి అధికారులు ఐసోలేషన్​ కిట్లు కూడా ఇవ్వడం లేవు. పేషెంట్లు అడిగితే.. అందుబాటులో లేవు, ఇంటికి పంపిస్తామంటూ దాటవేస్తున్నారు. ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పేవారు కూడా కరువయ్యారు. ఫోన్ ద్వారా ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాల్సిన ఉన్నా పట్టించుకోవడం లేదు. పాజిటివ్ ​పేషెంట్లు ఎప్పటికప్పుడు పల్స్​ చెక్​ చేసుకుంటుండాలి. కానీ, కిట్స్​ అందకపోవడం వల్ల పేదలు డబ్బు పెట్టి పల్స్​ఆక్సీమీటర్ ​కొనుగోలు చేయలేకపోతున్నారు. దాంతో కొన్నిసార్లు కండిషన్​ సీరియస్ అవుతోంది. మరోవైపు ఇంట్లో ఉండడానికి వసతి లేని పాజిటివ్ ​పేషెంట్ల కోసం ఐసోలేషన్​ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశాలనూ అమలు చేయడం లేదు. ఒక్కో సర్కిల్​లో 3 నుంచి 5 సెంటర్లు పెట్టాలని కమిషనర్​ నిర్ణయించినా, మొత్తంగా నాలుగైదుకి మించి ఏర్పాటు చేయలేదు. ఉన్న సెంటర్లలోనూ సౌలత్​లు కల్పించ లేదు.

For More News..

మూడువారాల్లో నాలుగు ఎన్‌‌కౌంటర్లు

కేటీఆర్ ఇలాకాలో ట్రాక్టర్ యజమానుల గుస్సా

ఇయ్యాల భారత్ బంద్