కన్నుల పండువగా ఎల్లమ్మ కల్యాణోత్సవం

కన్నుల పండువగా ఎల్లమ్మ కల్యాణోత్సవం

బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవం మంగళవారం కనుల పండువగా జరిగింది. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాల నడుమ మంత్రి తలసాని శ్రీనివాస్ ​యాదవ్ దంపతులు అమ్మవారికి పట్టుబట్టలు సమర్పించారు. సీఎస్ శాంతికుమారి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్​ విజయలక్ష్మి, బీజేపీ లీడర్ ​మర్రి శశిధర్ ​రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి భార్య కావ్యారెడ్డి సహా సిటీ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చి కల్యాణంలో పాల్గొన్నారు. 

వీఐపీ పాసులు ఎక్కువ ఇవ్వడంతో సాధారణ భక్తులు క్యూలైన్లలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కల్యాణం సందర్భంగా వివిధ కాలనీ సంఘాలు, పొలిటికల్ ​పార్టీల ఆధ్వర్యంలో ఆలయ చుట్టుపక్కల ఉన్న అన్ని రోడ్లలో స్టాల్స్​ఏర్పాటు చేసి అన్నదానం నిర్వహించారు. తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. బుధవారం జరిగే రథోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.   – వెలుగు, సికింద్రాబాద్/ఖైరతాబాద్/పద్మారావునగర్