మంత్రి ప్రశాంత్​రెడ్డికి నిరసన సెగ .. ఇత్వార్​పేట్​లో దళితులు, పోలీసుల మధ్య తోపులాట

మంత్రి ప్రశాంత్​రెడ్డికి నిరసన సెగ .. ఇత్వార్​పేట్​లో దళితులు, పోలీసుల మధ్య తోపులాట

బాల్కొండ, వెలుగు: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్​అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. సోమవారం ఇత్వార్​పేట్​లో దళితులు ఆయన ప్రచారాన్ని అడ్డుకున్నారు. గ్రామంలో 60 శాతం ఉన్న తమకు దళితబంధు ఇవ్వలేదనిమండిపడ్డారు.

నియోజకవర్గంలోనాలుగు గ్రామాలకు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎలా అని నిలదీశారు. అర్హులకు దళిత బంధు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, దళితులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. చేసేదేమీ లేక మంత్రి ప్రశాంత్​రెడ్డి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.