గద్దర్ కుటుంబానికి.. దత్తాత్రేయ పరామర్శ

గద్దర్ కుటుంబానికి..  దత్తాత్రేయ పరామర్శ

అల్వాల్, వెలుగు: ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆట పాటలతో ప్రతి గ్రామాన్ని ఉత్తేజ పరిచారని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. మంగళవారం అల్వాల్ భూదేవినగర్ లోని గద్దర్ ఇంటికి వెళ్లి ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. 

గద్దర్ కుటుంబసభ్యులను దత్తాత్రేయ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతం కోసం గద్దర్ తన జీవితాన్ని ప్రజా ఉద్యమానికి అంకితం చేశారన్నారు. గొప్ప కవి, ప్రజా గాయకుడిని తెలంగాణ జనం కోల్పోయారన్నారు. గద్దర్ కుటుంబానికి  తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.