కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడాలంటే భయపడ్డా: బండి సంజయ్

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడాలంటే భయపడ్డా: బండి సంజయ్

తెలంగాణ రాజకీయాల్లో కలకలం  సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో  మరో ట్విస్ట్​  వెలుగు చూసింది.  కేసీఆర్​ సీఎంగా ఉన్నప్పుడు ఫోన్​ మాట్లాడాలంటే భయపడ్డామని బండిసంజయ్​ అన్నారు.  ఫోన్​ ట్యాపింగ్​  కేసు విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్​ కుమార్​ కీలక వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో కొంతమంది రాజకీయనేతలు.. జర్నలిస్ట్​ల కేసు విచారణ ముమ్మురంగా కొనసాగుతుంది.

ఈ సమయంలో కేంద్రమంత్రి బండి సంజయ్​ ను సిట్​ అధికారులు సాక్షిగా రికార్డ్​ స్టేట్​ మెంట్​ చేసేందుకు రావాలని కోరారు. తన ఫొన్​ ట్యాపింగ్​ జరుగుతుందని గతంలో చెప్పానని.. హైదరాబాద్​.. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్​ట్యాపింగ్​ జరిగిందని ఆరోపించారు. 

కెసిఆర్ సీఎంగా ఉన్న పదేళ్లలో ఫోన్‌ మాట్లాడాలంటేనే భయపడేవాళ్లమన్నారు. ఫేస్‌ టైం, సిగ్నల్‌ యాప్‌లలోనే ఫోన్‌ మాట్లాడుకున్నామని తెలియజేశారు. కెటిఆర్ తో మాట్లాడిన తర్వాతే ప్రభాకర్‌ భారత్‌ వచ్చారని, తాను సిట్‌ ఎదుట హాజరై వాంగ్మూలం ఇస్తానని బండి స్పష్టం చేశారు.