కాళేశ్వరం ఇంజినీర్ గారూ.. బయటకొచ్చి మాట్లాడండి : సీఎం కేసీఆర్ పై బండి సంజయ్

కాళేశ్వరం ఇంజినీర్ గారూ.. బయటకొచ్చి మాట్లాడండి : సీఎం కేసీఆర్ పై బండి సంజయ్

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే  తమ పరువు పోయేదన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.  మొన్న కాలేశ్వరం మోటార్లు మునిగిపోయాయని.. ఇవాళ ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శించారు.  ప్రాజెక్టుకు ఇంజనీర్ అని చెప్పుకున్న కేసీఆర్ నుంచే  డబ్బులు వసూలు చెయ్యాలన్నారు.   నదులకు నడక నేర్పిన  కేసీఆర్ఎక్కడున్నా బయటకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  

కేసీఆర్ తీరుతో  తెలంగాణ నవ్వుల పాలయిందన్నారు బండి సంజయ్.  ప్రాజెక్టు కుంగిపోవడం ఏంటని ప్రశ్నించారు.  కమీషన్ల కోసం కక్కుర్తి  పడ్డ కేసీఆర్.. ప్రజా ధనాన్ని నాశనం చేసిండని ధ్వజమెత్తారు.   కేటీఆర్ లా తండ్రి పేరు చెప్పుకుని తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. కేటీఆర్ కు ఉన్న అర్హత ఏంటో చెప్పాలన్నారు.  అమెరికాలో చిప్పలు కడిగిన విషయం మరిచిపోయావా అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు.  కేటీఆర్ మాట్లాడేది ఓ భాషేనా? అంటూ  ధ్వజమెత్తారు బండి సంజయ్.