సింగరేణి ఓపెన్ కాస్ట్ గనిలో జరిగిన ప్రమాదంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ కోల్ మైన్స్ సేఫ్టీ అధికారులు తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్నారు. మృతి చెందిన కార్మికులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలన్నారు. సింగరేణిలో ఓబీ పనుల్లో అధికార పార్టీ నేతలు బినామిలతో కాంట్రాక్టు చేయిస్తున్నారన్నారు. అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి నిబంధలను గాలికి వదిలి వేయటంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సింగరేణి ప్రమాదం విషయంలో కేంద్ర మంత్రులకు పిర్యాదు చేస్తున్నామన్నారు. మృతి చెందిన కుటుంబలకు కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.
see more news