
కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ నుంచి వెళ్లిపోయిందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఏ పార్టీ అయినా గెలుస్తామని చెబుతుందని, కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా ఓడిపోతామని చెబుతున్నారని అన్నారు. ఓటమి తప్పదని తెలిసి కూడా ఆ పార్టీ నేతలు యాత్రలు ఎందుకు చేస్తున్నారని బండి చురకలంటించారు. ఎన్నికలకు ముందు వేర్వేరుగా పోటీ చేసి ఆ తర్వాత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. మోడీ నిజాయితీని చూసి ప్రజలు బీజేపీకి ఓటేస్తారని రాష్ట్రంలోని 119 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.