పీఎం కేర్స్ సహాయ నిధికి తన ఎంపీ ల్యాండ్స్ నుండి 1 కోటి రూపాయలు, ఒక నెల జీతం లక్ష రూపాయలను విరాళం ఇచ్చారు కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. నా పిలుపుకు స్పందించి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 1 గంట సమయంలో తెలంగాణ బీజేపీ కార్యకర్తలు భారీగా PM-CARES సహాయ నిధికి విరాళాలు అందించారన్నారు. PM-CARES సహాయ నిధికి సహాయం అందించాడని తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపుకు తెలంగాణ ప్రజలు ఏ ప్రాంతంలో ఉన్న, ఏ దేశంలో ఉన్న ముందుకు వచ్చి విరాళాలు పంపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
కరోనా మహమ్మరిని తరిమేద్దాం – దేశాన్ని గెలిపిద్దామన్న ఆయన..2 గంటల వ్యవధిలోనే ఇంత పెద్ద ఎత్తున దేశంకోసం ముందుకు వచ్చి PM-CARES సహాయ నిధికి విరాళాలు అందించిన బీజేపీ కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు అన్నారు. ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో తన ఎంపీ ల్యాండ్స్ నుండి 50 లక్షలను కరోనా వైరస్ నివారణకు వినియోగించడానికి ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.