దేవుళ్ల నిధులు మళ్లిస్తవా?.. కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

దేవుళ్ల నిధులు మళ్లిస్తవా?.. కేసీఆర్  పై బండి సంజయ్ ఫైర్

వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఇస్తానని చెప్పి దేవుడికే  శఠగోపం పెట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. రాజన్న ఆలయానికి నయాపైసా ఇవ్వకుండా భక్తులు సమర్పించిన కానుకల నుంచి కామారెడ్డికి నిధులు మళ్లించాలనుకోవడం దుర్మార్గమని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

స్వార్థ రాజకీయాల కోసం కేసీఆర్ ప్రజలనే కాదు, చివరికి దేవుళ్లను కూడా మోసం చేస్తారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు.  పాలమూరును దత్తత తీసుకుంటానని ప్రకటించి ఆ జిల్లా ప్రజలను,  కరీంనగర్ ను డల్లాస్, న్యూయర్క్ మాదిరిగా అభివృద్ధి చేస్తానని వారిని,  గజ్వేల్​ను నెంబర్ వన్ చేస్తానని హామీలిచ్చి వాళ్లను కేసీఆర్ మోసం చేశాడన్నారు. 

ఇప్పుడు ఓట్లు దండుకునేందుకు కామారెడ్డి ప్రజలను మోసం చేసేందుకు రెడీ అయ్యాడన్నారు. కామారెడ్డి అభివృద్ధికి నిధులు కేటాయిం చాలనుకోవడంలో అభ్యంతరం లేదని,  మిగిలిన నియోజకవర్గాల ప్రజలు ఏం పాపం చేశారని సంజయ్ ప్రశ్నించారు.  సీఎంకు చిత్తశుద్ధి ఉంటే  నేరుగా ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.