బీజేపీ ఇప్పటి దాకా చూపింది ట్రైలర్ మాత్రమే 

బీజేపీ ఇప్పటి దాకా చూపింది ట్రైలర్ మాత్రమే 

బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తమ ఎమ్మెల్యేలను చూసి కేసీఆర్ గజ గజ వణుకుతున్నడని అందుకే సస్పెండ్ చేశారని అన్నారు. కేసీఆర్కు బీజేపీ ఇప్పటి వరకు చూపింది కేవలం ట్రైలర్ మాత్రమేనని, తామేంటో చూపిస్తే ఆయన గుండె ఆగుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అన్న ఆయన.. సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసేందుకు వారు చేసిన తప్పేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రశ్నించి నిలదీస్తారన్న భయంతోనే సీఎం వారిని సభ నుంచి బయటకు పంపారని ఆరోపించారు. RRR అంటే కేసీఆర్కు వణుకు పుడుతోందని, అందుకే ప్లాన్ ప్రకారం ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్ సచ్చీలుడైతే ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఖరిపై గవర్నర్, రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం..

ఢిల్లీకి ఒక న్యాయం...రాష్ట్రానికి ఒక న్యాయమా ?

మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు